Facts about Tirumala Temple: తిరుమల, భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా లోని ఒక ఆధ్యాత్మిక జనగణన పట్టణం. ఇది తిరుపతి పట్టణ సముదాయం లోని శివారు ప్రాంతాలలో ఒకటి. ఈ పట్టణం తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ఒక భాగం. ఇది తిరుపతి రెవెన్యూ డివిజన్ లోని తిరుపతి పట్టణ మండలంలో ఉంది.
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో విష్ణుమూర్తి అవతారం వేంకటేశ్వరుడు ఉంటాడు. కలియుగ కష్టాల నుంచి మానవాళిని రక్షించేందుకే వేంకటేశ్వరుడు భూలోకంపై దర్శనమిచ్చాడని భక్తుల నమ్మకం. వేంకటేశ్వరుడిని శ్రీనివాస, బాలాజీ మరియు గోవింద వంటి ఇతర పేర్లతో పిలుస్తారు. తిరుమలలో దేవుడి దర్శనానికి సంబంధించి అనేక పురాణగాథలు ఉన్నాయి. ఖచ్చితంగా, కొన్ని అపోహలు నిజం కానవసరం లేదు, కానీ తిరుపతి బాలాజీ ఆలయం గురించిన ఈ మనోహరమైన వాస్తవాలు మీకు తెలిసిన ప్రతిదానిని ప్రశ్నించేలా చేస్తాయి.
Facts about Tirumala Temple
1. గుడి ఎంట్రన్స్లో మహద్వారానికి కుడివైపున వెంకటేశ్వర స్వామివారినితలపైఅనంతాళ్వారు కొట్టిన గుణపం ఉంటుంది. చిన్నపిల్లాడి రూపంలో ఉన్నస్వామివారిని ఆ రాడ్తో కొట్టడంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తమొస్తుంది.అప్పట్నుంచే స్వామి వారి గడ్డానికి గంధం పూయడమనే సాంప్రదాయంమొదలైంది.
2. వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు (రియల్ హెయిర్) ఉంటుంది. అస్సలుచిక్కు పడదని అంటారు.
3. తిరుమలలో టెంపుల్ నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంటుంది.ఆ గ్రామస్థులకు తప్పఇతరులకు ప్రవేశం లేదు అక్కడికి. ఆ గ్రామస్థులు చాలాపద్ధతిగా ఉంటారు.స్త్రీలు బ్లౌజెస్ కూడా వేసుకోరు అంత పద్దతిగా ఉంటారు.అక్కడి నుండే స్వామికి వాడే పూలు తెస్తారు. అక్కడే తోట ఉంది. గర్భ గుడిలోఉండే ప్రతీది ఆ గ్రామం నుండే వస్తుంది. పాలు, నెయ్యి, పూలు, వెన్న తదితరఅన్నీ.

4. స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్టు కనిపిస్తారు కానీ నిజానికి ఆయనగర్భగుడి కుడివైపు కార్నర్లో ఉంటారు. బయటి నుండి గమనిస్తే ఈ విషయంమనకు తెలుస్తుంది.
5. స్వామివారికి ప్రతీరోజూ క్రింద పంచె, పైన చీరతో అలంకరిస్తారు. దాదాపు 50వేల ఖరీదు చేసే సేవ ఒకటి ఉంటుంది. ఆ సేవలో పాల్గొన్న దంపతులకు చీరనుస్త్రీకి, పంచె పురుషునికి ఇస్తారు. చాలా తక్కువ టిక్కెట్స్ అమ్ముతారు ఇవి.
6. గర్భగుడిలో నుండి తీసి వేసిన పూలు అవీ అన్నీ అసలు బయటికి తీసుకురారు. స్వామి వెనకాల జలపాతం ఉంటుంది. అందులో వెనక్కి చూడకుండావిసిరి వేస్తారు.
7. స్వామి వారికి వీపు మీద ఎన్ని సార్లు తుడిచినా తడి ఉంటుంది. అలాగే అక్కడచెవి పెట్టి వింటే సముద్రపు ఘోష వినిపిస్తుంది.
8. స్వామివారి గుండె మీద లక్ష్మీదేవి ఉంటుంది. ప్రతీ గురువారం నిజరూపదర్శనం టైమ్లో స్వామివారికి చందనంతో అలంకరిస్తారు. అది తీసివేసినప్పుడులక్ష్మీదేవి అచ్చు అలానే వస్తుంది. దాన్ని అమ్ముతారు.
9. చనిపోయినప్పుడు వెనక్కి చూచూడకుండా ఎలా కాలుస్తారో, అలాగేస్వామివారికి తీసేసిన పూలు మరియు అన్ని పదార్థాలూ అదే విధంగా పూజారివారు వెనక్కి చూడకుండా స్వామి వెనక వేసేస్తారు. ఆ రోజంతా స్వామి వెనకచూడరు అని అంటారు. ఆ పూలు అన్నీ కూడా తిరుపతి నుండి ఇరవై కిలోమీటర్లదూరంలో ఉన్న వేర్పేడు (కాలహస్తికి వెళ్ళేదారిలో) దగ్గర పైకి వస్తాయి.
10. స్వామివారి ముందర వెలిగే దీపాలు కొండెక్కవు. అవి ఎన్నివేల సంవత్సరాలనుండి వెలుగుతున్నాయో కూడా ఎవ్వరికీ తెలీదు.
11. 1800 లో గుడిని పన్నెండు సంవత్సరాల పాటు మూసివేసి ఉండింది అంట.ఎవరో ఒక రాజు పన్నెండు మందిని గుడి దగ్గర తప్పు చేసినందుకు గానూహతమార్చి గోడకు వేలాడదీశాడంటా. ఆ టైమ్లోనే విమాన వెంకటేశ్వర స్వామివెలిసింది అంటారు.